Webdunia - Bharat's app for daily news and videos

Install App

1995కి తర్వాత 21వ శతాబ్దంలో అతిపెద్ద రైలు ప్రమాదం.. 300 మంది మృతి

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (17:25 IST)
Train
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 300 మంది మృతి చెందారు. భారతదేశంలో జరిగిన రైలు ప్రమాదాల చరిత్రలో ఒడిశా రైలు ప్రమాదం మూడో అతిపెద్దది. 1995 నుండి అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా ఒడిశా రైలు ప్రమాదం నిలిచింది.
 
అంతకుముందు 1981లో బీహార్‌లోని భాగమతి ప్రమాదంలో 750 మందికి పైగా, 1995లో యూపీలోని ఫిరోజాబాద్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 310 మంది మృతి చెందారు. 
 
ఇకపోతే.. ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకున్న ఘటన స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు.
 
21వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదం ఇదని.. ఈ ఘటనపై కేంద్రం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రైల్వేలో సమన్వయ లోపం, గ్యాప్ కనిపిస్తోంది. వీళ్లకు బడ్జెట్ కూడా ఉండదు అంటూ విమర్శించారు. 
 
రైలులో యాంటీ కొలిజన్ పరికరం లేదు. ఆ పరికరం రైలులో ఉండి ఉంటే.. ఈ ఘోరం జరిగేది కాదన్నారు. మృతుల కుటుంబాలకు రైల్వే పరిహారంగా రూ.10 లక్షలు అందజేస్తుందని ప్రకటించారు. 
 
తాము తమ రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని మమత ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున అందజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments