Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబ్జాదారులు గెంటేశారు... పంచాయతీ వత్తాసు పలికింది... మోడీజీ న్యాయం చేయండి

కబ్జాదారుల కారణంగా ఉన్న ఇంటిని కోల్పోయిన ఓ 11 యేళ్ల బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. తమ ఇంటిని కబ్జాదారులు స్వాధీనం చేసుకుని ఇంటిని నిర్మిస్తుంటే గ్రామ పంచాయతీ పెద్దలు వత్తాసు పలుకుతున్

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (09:09 IST)
కబ్జాదారుల కారణంగా ఉన్న ఇంటిని కోల్పోయిన ఓ 11 యేళ్ల బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. తమ ఇంటిని కబ్జాదారులు స్వాధీనం చేసుకుని ఇంటిని నిర్మిస్తుంటే గ్రామ పంచాయతీ పెద్దలు వత్తాసు పలుకుతున్నారనీ, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదనీ, అందువల్ల తమకు న్యాయం చేయాలంటూ ఆ బాలిక ప్రధాని మోడీకి లేఖ రాసింది.
 
ఒడిషా రాష్ట్రంలోని కటక్ జిల్లాలోని పోఖరి గ్రామానికి చెందిన ఉగ్రసేన్ మొహరానా కుమార్తె శుభశ్రీ రాసిన లేఖలోని వివరాలను పరిశీలిస్తే.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరింది. ఏ తప్పు చేయకుండానే తమను ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపారని, తిరిగి ఇంటికి చేరుకునేందుకు సాయం చేయాలని లేఖలో కోరింది.
 
గ్రామస్థులు తన తండ్రిపై దాడి చేయడమే కాకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారని ఆవేదన వ్యక్తంచేసింది. తమ భూమిని అన్యాయంగా లాక్కునేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకే తమపై కక్ష కట్టారని వివరించింది. కబ్జాదారులకు గ్రామ పంచాయతీ పెద్దలు సైతం వత్తాసు పలికారని, దీనిపై డీజీపీ కేబీ సింగ్, ఇతర ఉన్నతాధికారులను కలిసినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ప్రధానికి లేఖ రాసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments