Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కిడ్నాప్ చేసి.. 28 రోజుల పాటు గ్యాంగ్ రేప్.. నదిలో తోసేశారు..

చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని జైపూర్‌ జిల్లాకు చెందిన ఓ బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఏకంగా 28 రో

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (14:54 IST)
చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని జైపూర్‌ జిల్లాకు చెందిన ఓ బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఏకంగా 28 రోజుల పాటు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికను ఆదివారం సాయంత్రం ఖరస్రోస్టా నదిలో తోసేశారు.
 
అయితే నదిలో తోసేసినా ఆ బాలిక ఊపిరిని అరచేతిలో పెట్టుకుని ధైర్యంగా ఊదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని రౌట్రాపూర్ గ్రామానికి చేరుకున్న బాలిక గ్రామస్తుల సాయంతో ప్రాణాలతో బయటపడింది. 
 
గత నెల ఆగస్టు 20వ తేదీన ఆ బాలిక మధుబన్ బజార్లో స్టేషనరీ ఐటమ్స్ కొనుగోలు చేసేందుకుగాను ఇంటి నుంచి బయటికి వచ్చినట్లు గ్రామస్తులకు చెప్పింది. ఆ బాలికను నిందితులు అక్కడి నుండి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంట్లో ఆ బాలికను నిర్భంధించి గ్యాంగ్‌‌రేప్‌కు పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. 
 
ఇంకా ఆదివారం సాయంత్రం ఆ బాలికను నదిలో తోసేశారు. నది నుండి ఆ బాలిక ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకొంది. గ్రామస్తుల సహాయంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసు విచారణలో మామనే ఆ బాలికను కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం