Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సా సీఎం సంచలన నిర్ణయం : 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు...

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (11:55 IST)
ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన 76వ పుట్టిన రోజు వేడుకలు ఆయన శనివారం జరుపుకున్నారు. దీన్ని పురస్కరించుకుని 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కొలువులను రెగ్యులైజ్ చేశారు. పైగా, రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సీఎం నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఏకంగా రూ.1300 కోట్ల భారంపడనుంది. 
 
ఈ మేరకు శనివారం తన సారథ్యంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. 
 
ఈ కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, కాంట్రాక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిని శాశ్వతంగా రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ రెగ్యులర్ రిక్రూట్‌మెంట్లు లేవని, కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్‌మెంట్ జరుగుతోందని గుర్తు చేశారు. 
 
ఒరిస్సాలో దానికి ఇప్పుడు ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం ద్వారా 57 వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రకటన చేయగానే కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. దీపావళి పండుగ ముందే వచ్చిందంటూ స్వీట్లు పంచుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments