Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోళి వేళ విషాదం : నదిలోకి స్నానానికెళ్లి ఆరుగురు గల్లంతు

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (15:10 IST)
హోళీ పండగ వేళ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పండగ పూట నదిలోకి స్నానానికెళ్లిన ఆరుగురు బాలురు గల్లంతయ్యాయరు. ఇందులో మూడు మృతదేహాలను వెలికి తీశారు. మరో మూడు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ విషాదకర ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
హోళీ సంబరాల తర్వాత శనివారం ఆరుగురు బాలురు జాజ్‌పూర్‌లోని ఖరస్రోత నదిలో దిగి స్నానం చేస్తున్నారు. ఆసమయంలో ప్రమాదవవశాత్తు ఒకరు నీటిలో మునిగిపోతుండగా.. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి ఒకరి తర్వాత ఒకరు అందరూ మునిగిపోయారు. గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
 
హోళీ ఆడి నదిలో స్నానం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. మునిగిపోతున్న వారిని గమనించి రక్షించడానికి ప్రయత్నించామని, కానీ ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments