Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నగారి విగ్రహం తెనాలిలో తయారై.. బెంగళూరు పార్కుకు వెళ్లింది.. ఎంజీఆర్ విగ్రహం కూడా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని కర్ణాటక రాజధాని బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌ జె.పి పార్కులో ప్రతిష్టించనున్నారు. ఈ పార్కులో ప్రతిష్టించనున్న విగ్రహా

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (10:00 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని కర్ణాటక రాజధాని బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌ జె.పి పార్కులో ప్రతిష్టించనున్నారు. ఈ పార్కులో ప్రతిష్టించనున్న విగ్రహాల తయారీకి కళల కాణాచి తెనాలి వేదికైంది. విగ్రహాల తయారీలో తెనాలికున్న పేరు ప్రఖ్యాతులు తెలుసుకున్న ఆ రాష్ట్ర ఎమ్మెల్యే మునిరత్నం పట్టణానికి చెందిన శిల్పి కాటూరి రవిచంద్రను సంప్రదించారు.
 
దేశానికి చెందిన 34 మంది ప్రముఖుల విగ్రహాలను తయారు చేసేందుకు ప్రణాళిక వేసి.. మూడు నెలల కాలంలో ఫైబర్ విగ్రహాలను తీర్చిదిద్దారు. ఇందులో చత్రపతి శివాజీ, టిప్పు సుల్తాన్‌, ఝాన్సీరాణి, బాబూరాజేంద్ర ప్రసాద్‌, నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌, అంబేడ్కర్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, భగత్‌సింగ్‌, మడకరి నాయక, సంగోలి రాయన్న, జయచామరాజ వడయార్‌, ఇందిరాగాంధీ, పింగళి వెంకయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్యల విగ్రహాలున్నాయి. 
 
అంతేగాకుండా ఎన్టీ రామారావు, ఎం.జి.రామచంద్రన్‌, రాజకుమార్‌, ప్రేమ్‌ నజీర్‌, కె.సి.రెడ్డి, వినాయక కృష్ణ గోకక్‌, హనుమంతయ్య, చంద్రశేఖర్‌ కుమార్‌, మస్తి వెంకటేష్‌ అయ్యంగార్‌ తదితరుల విగ్రహాలు ఉన్నాయి. శనివారం వీటిని బెంగళూరుకు తరలించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments