Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నగారి విగ్రహం తెనాలిలో తయారై.. బెంగళూరు పార్కుకు వెళ్లింది.. ఎంజీఆర్ విగ్రహం కూడా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని కర్ణాటక రాజధాని బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌ జె.పి పార్కులో ప్రతిష్టించనున్నారు. ఈ పార్కులో ప్రతిష్టించనున్న విగ్రహా

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (10:00 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని కర్ణాటక రాజధాని బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌ జె.పి పార్కులో ప్రతిష్టించనున్నారు. ఈ పార్కులో ప్రతిష్టించనున్న విగ్రహాల తయారీకి కళల కాణాచి తెనాలి వేదికైంది. విగ్రహాల తయారీలో తెనాలికున్న పేరు ప్రఖ్యాతులు తెలుసుకున్న ఆ రాష్ట్ర ఎమ్మెల్యే మునిరత్నం పట్టణానికి చెందిన శిల్పి కాటూరి రవిచంద్రను సంప్రదించారు.
 
దేశానికి చెందిన 34 మంది ప్రముఖుల విగ్రహాలను తయారు చేసేందుకు ప్రణాళిక వేసి.. మూడు నెలల కాలంలో ఫైబర్ విగ్రహాలను తీర్చిదిద్దారు. ఇందులో చత్రపతి శివాజీ, టిప్పు సుల్తాన్‌, ఝాన్సీరాణి, బాబూరాజేంద్ర ప్రసాద్‌, నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌, అంబేడ్కర్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, భగత్‌సింగ్‌, మడకరి నాయక, సంగోలి రాయన్న, జయచామరాజ వడయార్‌, ఇందిరాగాంధీ, పింగళి వెంకయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్యల విగ్రహాలున్నాయి. 
 
అంతేగాకుండా ఎన్టీ రామారావు, ఎం.జి.రామచంద్రన్‌, రాజకుమార్‌, ప్రేమ్‌ నజీర్‌, కె.సి.రెడ్డి, వినాయక కృష్ణ గోకక్‌, హనుమంతయ్య, చంద్రశేఖర్‌ కుమార్‌, మస్తి వెంకటేష్‌ అయ్యంగార్‌ తదితరుల విగ్రహాలు ఉన్నాయి. శనివారం వీటిని బెంగళూరుకు తరలించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments