ఐఎస్ఐఎస్లో చేరిన కేరళ ఎన్.ఎస్.జి కమాండో చెల్లెలు... సీఎం విజయన్కు తల్లి మొర!
భారత్లో ఉన్న భద్రతా సిబ్బందిలో ఎన్.ఎస్.జి కమాండో ఓ భాగం. అత్యంత సుశిక్షుతులైన యువ కమాండోలు ఇందులో విధులు నిర్వహిస్తుంటారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి దేశాన్ని, ప్రజ
భారత్లో ఉన్న భద్రతా సిబ్బందిలో ఎన్.ఎస్.జి కమాండో ఓ భాగం. అత్యంత సుశిక్షుతులైన యువ కమాండోలు ఇందులో విధులు నిర్వహిస్తుంటారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి దేశాన్ని, ప్రజల ప్రాణాలను కాపాడుతుంటారు. అలాంటి ఎన్.ఎస్.జి కమాండో చెల్లెలు ఒకరు ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ తీవ్రవాదుల్లో చేరిపోయింది. ఆమె కాదు.. ఆమె భర్త కూడా ఈ సంస్థలో చేరినట్టు వార్తలు వస్తున్నాయి.
కేరళ నుంచి మాయమైన వారిలో 24 ఏళ్ల యువతి ఉంది. ఈమె గర్భవతి. ప్రస్తుతం ఈమె సిరియాలోని ఇసిస్ సంస్థలో పని చేస్తున్నట్టు ఆమె తల్లి బిందు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ను కలిసి వెల్లడించింది.
తన బిడ్డ.. ఎంతో తెలివైందని చెప్పుకొచ్చింది. ఓ క్రిస్టియన్ను వివాహం చేసుకుందని, ఆపై వారిద్దరూ ముస్లిం మతం స్వీకరించారని, ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదని వాపోయింది. గత నెల 5న శ్రీలంక వెళుతున్నట్టు చెప్పిందని, ఆపై చాలా రోజులు సమాచారం లేదని తెలిపింది.
ఆపై ఎక్కడి నుంచి మాట్లాడుతున్నదీ వెల్లడించకుండా, వాట్సాప్ ద్వారా ఒక్క సారి ఫోన్ చేసిందని వివరించింది. దీనిపై ఆరా తీసి తన కుమార్తె ఆచూకీ తెలుసుకోవాలని కోరింది. అలాగే, ఈమె భర్త కూడా కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.