Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ చరిత్రకారుడు బాబాసాహెబ్ పురందరే ఇకలేరు

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (10:01 IST)
దేశంలో ఉన్న ప్రముఖ చరిత్రకారుల్లో ఒకరు బాబాసాహెబ్ పురందరే. ఈయన రచయిత కూడా. గత జూలై 29న 99వ పుట్టినరోజు జరుపుకున్న ఆయన గత శనివారం బాత్‌రూంలో జారిపడ్డారు. దీంతో పుణెలోని దీననాథ్ మంగేష్కర్ దవాఖాన ఐసీయూలో చికిత్స పొందుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం 5.07 గంటలకు తుదిశ్వాస విడిచారు. పుణేలోని వైకుంఠ శ్మశాన వాటికలో సోమవారం ఉదయం 10.30 గంటలకు పురందరే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 
కాగా, చరిత్రకారుడు, రచయిత అయిన పురందరే నారాయణ్‌ రావ్‌ పీశ్వా, కేసరి, రాజా శివ్‌ఛత్రపతి, షెలార్క్‌హింద్‌, దౌలత్‌, నౌబత్‌ వంటి అనేక నవలలు రాశారు. శివాజీ కాలం నుంచి రాజు, అతని పరిపాలన, కోటలపై పలు పుస్తకాలు రాశారు. 
 
అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై రాసిన ‘జనతా రాజ్’ నాటకంతో ప్రసిద్ధి చెందారు. ఆ నటకానికి దర్శకత్వం కూడా వహించారు. రాజా శివ్‌ఛత్రపతి నవల 16 ఎడిషన్లు పబ్లిష్‌ అయ్యాయి. 5 లక్షలకుపైగా ప్రతులు అమ్ముడుపోయాయి. 
 
మరోవైపు, పురందరే సేవలకుగాను మహారాష్ట్ర ప్రభుత్వం 2015లో ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డును ప్రదానం చేసింది. 2019లో భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ అందుకున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments