Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ ఎత్తివేయడం అనుమానమే అంటున్న బీజేపీ నేత!!

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (17:50 IST)
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది వచ్చే నెల మూడో తేదీ వరకు అమల్లోవుండనుంది. ఆ తర్వాత ఈ లాక్‌డౌన్ ఎత్తివేస్తారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మే 15వ తేదీ వరకు మరోసారి పొడగించనున్నారని చెప్పుకుంటున్నారు. దీంతో లాక్‌డౌన్ పొడగింపు, ఎత్తివేతపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. 
 
మరోవైపు, ఈ లాక్‌డౌన్ అంశంపై బీజేపీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పందించారు. మే 3వ తేదీ తర్వాత లాక్‌‌డౌన్‌ తొలగిస్తారో, లేదో ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదని, ఆ సమయానికి దేశంలోని కరోనా వ్యాప్తిని బట్టి తదుపరి నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, కరోనా వైరస్ అడ్డుకట్టకు రాష్ట్రాలన్నీ ఐకమత్యంతో పోరాటం కొనసాగిస్తున్నాయని, రాజకీయాలను పక్కనబెట్టి, ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారన్నారు. కనీసం మరో యేడాది పాటు దేశంలో బహిరంగ సభలు, సమావేశాలు ఉండక పోవచ్చని ఆయన అంచనా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments