Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్ట్రాసౌండ్ స్కాన్‌లో కనిపించిన కవలలు.. ఆపరేషన్ చేసి ఒక్క బిడ్డనే తీసిన వైద్యులు!

గర్భిణి మహిళను పరిక్షించిన వైద్యులు ఆమెకు కవల పిల్లలు పుడతారని చెప్పి తీరా డెలివరీ అయ్యాక ఒక బిడ్డనే చేతికిచ్చిన ఘటన ఢిల్లీ శివారులోని నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన 23 ఏ

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (12:43 IST)
గర్భిణి మహిళను పరిక్షించిన వైద్యులు ఆమెకు కవల పిల్లలు పుడతారని చెప్పి తీరా డెలివరీ అయ్యాక ఒక బిడ్డనే చేతికిచ్చిన ఘటన ఢిల్లీ శివారులోని నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన 23 ఏళ్ల సంగీతాదేవి ఈ నెల 20న పురిటినొప్పులతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఆమెకు పురుడు పోసిన వైద్యులు ఒకే ఒక బిడ్డను చేతికిచ్చారు. అయితే.. డెలివరీకి ముందు కవలపిల్లలను పుడతారని వైద్యులు చెప్పారని.. ఇప్పుడు ఒక బిడ్డనే ఇచ్చారని సంగీత ఆవేదన వ్యక్తం చేసింది.
 
ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించినప్పుడు తన గర్భంలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వైద్యులు చెప్పారని చెప్పింది. అంతేకాక కవల పిల్లల వల్ల తనకు సహజ ప్రసవం అవ్వడం కష్టమని.. శస్త్రచికిత్స చేసేందుకు డాక్టర్లు తమ వద్ద సంతకం కూడా తీసుకున్నారని వాపోయింది. 
 
ఇదిలావుంటే.. .తమ బిడ్డను ఆసుపత్రి యాజమాన్యమే తీసుకుందని సంగీత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ... ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన ఆసుపత్రి చీఫ్‌ సూపరిండెంట్‌.. ఘటనపై విచారణకు ఆదేశించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments