Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి ముందు శారీరక సంబంధం.. రేప్ ఎలా అవుతుంది... ఢిల్లీ హైకోర్టు

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (14:05 IST)
ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకుంటాననే హామీతో కొంతకాలం శారీరకంగా కలవడాన్ని అత్యాచారంగా పరిగణించలేమని ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పెళ్లికి ముందు యువతి, యువకుడు, లేక ఆడా, మగవారు చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్న సమయంలో జరిగే శారీరక కలయిక ప్రతి సందర్భంలోనూ అత్యాచారం కిందకి పరిగణనలోకి రాదని ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. ఎక్కువ కాలం ప్రేమలో ఉన్నప్పుడు ఏర్పడే శారీరక సంబంధాలు అత్యాచారం జరిగిందని సమర్థించలేమని జస్టిస్ విభు భక్రు పేర్కొన్నారు.
 
పెళ్లి చేసుకుంటానని తనని నమ్మించిన వ్యక్తి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లి పేరుతో సుదీర్ఘకాలం శారీరక సంబంధాలు కొనసాగించడాన్ని అత్యాచారం జరిగినట్లు పరిగణించలేమని చెప్పడంతో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించారు.
 
కాగా, కొన్నేళ్ల కిందట 2008లో ఓ వ్యక్తితో యువతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం వాళ్లిద్దరూ కలిసి ఉన్నారు. ఆపై పెళ్లి పేరుతో నమ్మించి తనపై అత్యాచారం చేశాడని కోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘకాలం కొనసాగిన సంబంధాలను అత్యాచారం కిందకి రాదని, అత్యాచారం జరిగిందని భావించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments