Webdunia - Bharat's app for daily news and videos

Install App

2000 కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ లేదు: ఆర్బీఐ

Webdunia
శనివారం, 29 మే 2021 (09:35 IST)
2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రూ.2,000 నోట్లను ముద్రించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గురువారం తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కూడా కొత్తగా నోట్లు తీసుకు రాలేదని తెలిపింది.

ఆర్బీఐ మే 26వ తేదీన వార్షిక నివేదిక విడుదల చేసింది. FY21లో మొత్తంగా పేపర్ క్యాష్ సరఫరా 0.3 శాతం మేర తగ్గి 2,23,301 లక్షల నోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది 2,23,875 లక్షల కరెన్సీ నోట్లు సరఫరా అయ్యాయి.
 
ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వ్యాల్యూ కలిగిన డినామినేషన్ రూ.500, రూ.2000 నోట్లు. కరెన్సీ సరఫరాలో ఈ రెండింటి వ్యాల్యూ 85.7 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అధిక విలువ కలిగిన ఈ కరెన్సీ వ్యాల్యూ వాటా ఎక్కువ. అంతకుముందు ఎడాది 83.4 శాతంగా ఉంది. వ్యాల్యూమ్ పరంగా రూ.500 డినామినేషన్ కలిగిన నోట్ల వాటా 31.1 శాతం.
 
రూ.2000 నోట్లు ప్రింట్ చేయలేదని గత ఏడాది వార్షిక నివేదికలోను ఆర్బీఐ పేర్కొంది. 2018 నుండి వ్యవస్థలో రూ.2000 నోట్లు తగ్గుతూ వస్తున్నాయి. 2018 మార్చి నాటికి 33,632 లక్షలు ఉండగా, 2019 మార్చి చివరి నాటికి 32,910 లక్షల నోట్లు, 2020 చివరి నాటికి 27,398 లక్షల నోట్లకు తగ్గాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments