Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనవంతులకు ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీ కట్!

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (09:46 IST)
దేశంలోని ధనవంతులకు ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీని తొలగించే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. కొందరు హర్షించినా, వ్యతిరేకించినా దేశ శ్రేయస్సు కోసం అతి ముఖ్యమైన ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పదని ఆయన అన్నారు. 
 
ఈ విషయమై ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ... ఎల్పీజీ సబ్సిడీ తొలగింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉన్నత స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుడు నిర్ణయం తీసుకోగలిగితే ఎలాంటి క్లిష్ట సమస్య అయినా అతి సులభంగా పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు. 
 
గత ప్రభుత్వాలు గ్యాస్, డీజిల్ తదితర సమస్యలపై సరైన దృష్టి సారించలేదని, తమ ప్రభుత్వం మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకుంటుందని అరుణ్‌జైట్లీ తెలిపారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments