Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యానంద సెన్సేషనల్ కామెంట్స్: వాళ్లంతా రూ.300కి ఆశపడేవారే!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (10:32 IST)
వివాదాస్పద నిత్యానంద స్వామి మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కన్నడ భాష పేరిట తనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారంతా రూ.300 కోసం ఆశపడేవారేనని విమర్శించి చిక్కుల్లో పడ్డారు. మూడు గంటల ఆందోళన కోసం ఆ మొత్తం తీసుకుంటున్నారే గానీ, వారికి తన పైన ఏమాత్రం కోపం లేదన్నారు. నిరసనలకు నేతృత్వం వహించే వారు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
 
తాను ఆశ్రమం లోపలే ఉన్నా, తన కోసం ఆందోళనకారులు బయట నిలబడి వేచి చూస్తుంటారని నిత్యానంద విమర్శించారు. మూడు గంటల తర్వాత ఆందోళన విరమించి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. ఆయన భక్తులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన కన్నడ సంఘాలు మరోసారి మండిపడుతున్నాయి. 
 
కాగా, నిత్యానందకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఓ కేసు విషయంలో నిత్యానందకు ఈ మేరకు వారెంట్ జారీ చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఆగస్టు 6న నిత్యానందను అదుపులోకి తీసుకుని పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments