బీహార్ రాజకీయాల్లో సంచలనం... 28న జేడీయూ - బీజేపీ కూటమి సర్కారు

వరుణ్
శుక్రవారం, 26 జనవరి 2024 (15:04 IST)
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయు అధినేత నితీశ్ కుమార్ పల్టీ కొట్టారు. ఇంతకాలం చెలిమి చేసిన ఆర్జేడీని పక్కనపెట్టేశాడు. ఇపుడు మళ్లీ  భారతీయ జనతా పార్టీ చెంతకు చేరారు. ఫలితంగా ఈ నెల 28వ తేదీన బీహార్ రాష్ట్రంలో జేడీయూ - ఆర్జేడీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మరోమారు ఏర్పాటుకానుంది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా సుశీల్ మోడీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
కాగా, తాజాగా సుశీల్ మోడీ ట్వీట్ చేస్తూ.. మూసుకుపోయిన తలుపులు తెరుచుకోవచ్చు అని పేర్కొన్నారు. రాజకీయాలను ఆయన గేమ్ ఆఫ్ పాజిబిలిటీస్‌గా అభివర్ణించారు. అయితే, అంతకుమించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఆర్జేడీతో పొత్తుకు నితీశ్ బ్రేక్ చెప్పబోతున్నారంటూ ఒకటే ప్రచారం జరుగుతున్న వేళ తాజా పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. 
 
మరోవైపు, సోషలిస్టు నేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆ తర్వాత బీహార్‌ రాష్ట్ర రాజకీయాలు చకచకా మార్పులు జరిగిపోయాయి. నితీశ్‌ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. మరోవైపు, బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకం చేసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన తొలి నేత నితీశ్ కుమార్. ఇపుడు ఈ కూటమి నుంచి ఆయనే తొలిసారి వైదొలగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments