Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఎస్ఎస్ తీరుతో దేశంలో అలజడులు : నితీష్ కుమార్

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (11:47 IST)
ఆర్ఎస్ఎస్‌కు చెందిన నేతలు అనుసరిస్తున్న వైఖరి, చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా దేశంలో అలజడి చెలరేగుతోందని బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆరోపించారు. ఇండియా అంటే హిందూ దేశమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నితీష్ కుమార్ స్పందించారు. 
 
ఇదే అంశంపై ఆయన పాట్నాలో మాట్లాడుతూ, మతమార్పిళ్లు వద్దంటూ ఒకవైపు ఉపన్యాసాలు ఊదరగొడుతూ, మరోవైపు ఇతర మతాలకు చెందిన వారు హిందూ మతంలోకి రావాలని ఆర్ఎస్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హిందువులను మతం మార్చవద్దని మైనార్టీలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విజ్ఞప్తి చేయడం సరికాదన్నారు. 
 
మోహన్ భగవత్ వ్యాఖ్యలతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, 'ఘర్ వాపసీ' కార్యక్రమంతో దేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పార్టీలన్నీ ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు ఖండిస్తుండగా, బీజేపీ మాత్రం వంత పాడుతోందని నితీష్ కుమార్ మండిపడ్డారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments