Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులకు ఉరి.. మరోమారు డెత్ వారెంట్ జారీ

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (16:46 IST)
నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలకు వచ్చే నెల మూడో తేదీన ఉరిశిక్షలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు డెత్ వారెంట్‌ను జారీచేసింది. మార్చి 3వ తేదీ ఉద‌యం 6 గంట‌ల‌కు నిర్భ‌య నిందితుల‌ను ఉరి తీయాల‌ని ఆ వారెంట్‌లో కోర్టు ఆదేశించింది. ఈ న‌లుగురు నిందితులకు డెత్ వారెంట్ జారీ చేయ‌డం ఇది మూడ‌వ‌సారి. 
 
నిందితుల క్ష‌మాభిక్ష పిటిష‌న్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కార‌ణంగా.. గ‌త రెండు వారెంట్లు ర‌ద్దు అయ్యాయి. ఈ సారైనా నిందితుల‌కు ఉరిశిక్ష ప‌డుతుంద‌ని నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి ఆశాభావం వ్య‌క్తంచేసింది. పటియాలా హౌజ్ కోర్టులోని అడిష‌న‌ల్ సెష‌న్ జ‌డ్జి ధ‌ర్మేంద‌ర్ రాణా.. తాజా డెత్ వారెంట్ జారీ చేశారు. 
 
కాగా, న్యాయ వ్యవస్థలోని లోపాలను అడ్డుపెట్టుకుని ఈ నలుగురు ముద్దాయిలు తమకు విధించిన ఉరిశిక్షలు అమలుకాకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా నలుగురు ముద్దాయిలు ఇదే తరహాలో కోర్టును ఆశ్రయిస్తూ, ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments