నిర్భయ దోషులకు ఉరి.. మరోమారు డెత్ వారెంట్ జారీ

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (16:46 IST)
నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలకు వచ్చే నెల మూడో తేదీన ఉరిశిక్షలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు డెత్ వారెంట్‌ను జారీచేసింది. మార్చి 3వ తేదీ ఉద‌యం 6 గంట‌ల‌కు నిర్భ‌య నిందితుల‌ను ఉరి తీయాల‌ని ఆ వారెంట్‌లో కోర్టు ఆదేశించింది. ఈ న‌లుగురు నిందితులకు డెత్ వారెంట్ జారీ చేయ‌డం ఇది మూడ‌వ‌సారి. 
 
నిందితుల క్ష‌మాభిక్ష పిటిష‌న్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కార‌ణంగా.. గ‌త రెండు వారెంట్లు ర‌ద్దు అయ్యాయి. ఈ సారైనా నిందితుల‌కు ఉరిశిక్ష ప‌డుతుంద‌ని నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి ఆశాభావం వ్య‌క్తంచేసింది. పటియాలా హౌజ్ కోర్టులోని అడిష‌న‌ల్ సెష‌న్ జ‌డ్జి ధ‌ర్మేంద‌ర్ రాణా.. తాజా డెత్ వారెంట్ జారీ చేశారు. 
 
కాగా, న్యాయ వ్యవస్థలోని లోపాలను అడ్డుపెట్టుకుని ఈ నలుగురు ముద్దాయిలు తమకు విధించిన ఉరిశిక్షలు అమలుకాకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా నలుగురు ముద్దాయిలు ఇదే తరహాలో కోర్టును ఆశ్రయిస్తూ, ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments