Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నిర్భయ' దోషులను ఎందుకు ఉరితీయరు?

గత యూపీఏ సర్కారు పాలనలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలను ఇంకా ఉరి ఎందుకు తీయడం లేదనీ ఢిల్లీ మహిళా కమిషన్ నిలదీసింది.

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (09:16 IST)
గత యూపీఏ సర్కారు పాలనలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలను ఇంకా ఉరి ఎందుకు తీయడం లేదనీ ఢిల్లీ మహిళా కమిషన్ నిలదీసింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులతో పాటు.. దక్షిణ ఢిల్లీ జిల్లా డీసీపీకి డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ నోటీసులు జారీ చేశారు. 
 
తమ కుమార్తెపై దారుణంగా మూకుమ్మడి అత్యాచారం చేసి చంపేసిన కేసులో దోషులకు సుప్రీంకోర్టు మరణశిక్ష ధ్రువీకరించిన ఆరు నెలల తర్వాత కూడా వారిని ఉరి తీయలేదంటూ నిర్భయ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ నోటీసు ఇచ్చామని కమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
 
కాగా, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌, క్యూరేటివ్‌ పిటిషన్‌, న్యాయ మార్గాల తర్వాత చిట్టచివరగా రాష్ట్రపతిని క్షమాభిక్ష వేడుకునే వంటి అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నప్పటికీ మరణశిక్ష పడిన ఆ నలుగురి విషయంలో డీసీడబ్ల్యూ నోటీసు జారీ చేయడం విశేషం. దీనిపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments