'నిర్భయ' దోషులను ఎందుకు ఉరితీయరు?

గత యూపీఏ సర్కారు పాలనలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలను ఇంకా ఉరి ఎందుకు తీయడం లేదనీ ఢిల్లీ మహిళా కమిషన్ నిలదీసింది.

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (09:16 IST)
గత యూపీఏ సర్కారు పాలనలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలను ఇంకా ఉరి ఎందుకు తీయడం లేదనీ ఢిల్లీ మహిళా కమిషన్ నిలదీసింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులతో పాటు.. దక్షిణ ఢిల్లీ జిల్లా డీసీపీకి డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ నోటీసులు జారీ చేశారు. 
 
తమ కుమార్తెపై దారుణంగా మూకుమ్మడి అత్యాచారం చేసి చంపేసిన కేసులో దోషులకు సుప్రీంకోర్టు మరణశిక్ష ధ్రువీకరించిన ఆరు నెలల తర్వాత కూడా వారిని ఉరి తీయలేదంటూ నిర్భయ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ నోటీసు ఇచ్చామని కమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
 
కాగా, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌, క్యూరేటివ్‌ పిటిషన్‌, న్యాయ మార్గాల తర్వాత చిట్టచివరగా రాష్ట్రపతిని క్షమాభిక్ష వేడుకునే వంటి అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నప్పటికీ మరణశిక్ష పడిన ఆ నలుగురి విషయంలో డీసీడబ్ల్యూ నోటీసు జారీ చేయడం విశేషం. దీనిపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments