Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైల్లో చిత్రహింసలు.. నాకు పిచ్చెక్కింది.. నిర్భయ దోషి కొత్త ఎత్తుగడ

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (10:22 IST)
నిర్భయ అత్యాచార కేసులో దోషిగా తేలిన ముద్దాయిల్లో ఓ ముద్దాయి సరికొత్త ఎత్తుగడ వేశారు. తీహార్ జైలు అధికారులు చిత్రహింసలకు గురిచేశారనీ, ఫలితంగా తనకు పిచ్చెక్కినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను మానసిక రోగంతో బాధపడుతున్నట్టు పేర్కొన్నాడు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ ముద్దాయి పేరు వినయ్ శర్మ. ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరుగనుంది. 
 
నిజానికి నిర్భయ దోషులకు జనవరి 22వ తేదీనే ఉరితీయాల్సివుంది. కానీ, వినయ్ శర్మే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ తర్వాత ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరితీస్తారని భావించారు. కానీ, నలుగురు నిందితులు నాలుగు రకాలుగా మార్చిమార్చి పిటిషన్లు దాఖలు చేస్తూ ఊరిశిక్షలను అమలు కాకుండా సాగదీస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్న ఉద్దేశంతో రాజ్యాంగం, చట్టం ప్రసాదించిన అవకాశాలను వినియోగించుకుంటూ దోషులు రోజుకో ఎత్తుగడతో కాలహరణం చేస్తూ వస్తున్నారు. 
 
తాజాగా వినయ్ శర్మ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. 'నన్ను తీహార్‌ జైల్లో చిత్రహింసలు పెట్టారు. ఆ కారణంగా నాకు పిచ్చెక్కింది. మానసిక సమస్యతో నేను బాధపడుతున్నాను' అంటూ తాజాగా దోషి వినయ్ శర్మ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపాడు. ఈ కారణాన్ని చూపిస్తూ రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చడాన్ని సవాల్‌ చేశాడు. 
 
తన మానసిక వ్యాధిని దేశ ప్రథమ పౌరుడు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. మరోవైపు పిటిషనర్‌ ఆరోగ్యంగానే ఉన్నాడని, ఎటువంటి మానసిక సమస్యలు లేవని కేంద్రం కోర్టుకు తెలిపింది. కాగా, పిటిషన్‌ స్వీకరించి విచారించిన ధర్మాసనం తీర్పు ఈరోజుకు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments