Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాట్నా పేలుళ్ల కేసులో నలుగురికి మరణదండన

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (19:36 IST)
గత 2013లో బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నలుగురు వ్యక్తులను దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఈ నలుగురు ముద్దాయిలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో మొత్తం 9 మంది దోషులుగా తేలగా, వీరిలో నలుగురికి ఉరిశిక్షను విధించగా, మరో ఇద్దరికీ యావజ్జీవం, మరో ఇద్దరికీ పదేళ్లు, ఒకరికీ ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ జడ్జి గుర్విందర్‌ సింగ్‌ మల్హోత్ర తీర్పునిచ్చారు. 
 
బాంబు పేలుళ్లు జరిగిన 8 ఏళ్ల తర్వాత.. కేసులో దోషులకు శిక్ష ఖరారైంది. గత 2013 అక్టోబరు 27వ తేదీన బిహార్‌ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో బిజెపి నేతృత్వంలో హుంకార్‌ సభ జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రధాన మంత్రి అభ్యర్థి హోదాలో ముఖ్య అతిధిగా నరేంద్ర మోడీ హాజరయ్యారు. 
 
మోడీతో పాటు పలువురు వేదికపై ఉన్న సమయంలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 89 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మరుసటి రోజే ఎన్‌ఐఎ దర్యాప్తు చేపట్టింది. తర్వాత ఏడాదికి చార్జీషీట్‌ దాఖలు చేసి.. 11 మందిని జాబితాలో చేర్చింది. సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఇద్దరు నిర్దోషులుగా బయటపడ్డారు. ఇపుడు తీర్పురాగా, నలుగురు మరణశిక్షను ఎదుర్కోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం