కఠిన ఆంక్షల దిశగా యూపీ సర్కారు - 25 నుంచి రాత్రి కర్ఫ్యూ

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:57 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులోభాగంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇది రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. 
 
అలాగే, వివాహాది శుభకార్యాలకు కూడా ఆంక్షలు విధించింది. కేవలం 200 మందికి మించి పాల్గొనకుండా నిబంధన విధించింది. పైగా, ఇలాంటి కార్యక్రమాలకు హాజరైన వారంతా విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, కోవిడ్ మార్గదర్శకాలకు లోబడి ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచన చేసింది. 
 
దేశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రం రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తుంది. ఇపుడు యూపీ సర్కారు కూడా ఈ తరహా ఆంక్షలను అమలు చేసేందుకు సిద్ధమైంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు యూపీలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వం క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై ఇప్పటికే నిషేధం విధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments