Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ కేపిటల్‌లో రోబో సాయంతో భారీ పేలుళ్ళకు కుట్ర

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (14:42 IST)
దేశ ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగుళూరు మహానగరంలో ఉగ్రసంస్థ ఐసిస్‌ సహకారంతో భారీ పేలుళ్లకు పాల్పడేందుకు తీవ్రవాదులు కుట్ర పన్నారని ఎన్.ఐ.ఏ ఆరోపిస్తుంది. దేశ వ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడేందుకు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) విచ్ఛిన్నం చేసి, ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా వీరిపై చార్జిషీటును తాజాగా సమర్పించింది. 
 
ఆ కుట్ర కేసులో మహ్మద్‌ షరీఖ్‌ (25), మాజ్‌ మునీర్‌ అహ్మద్‌ (23), సయ్యద్‌ యాసిన్‌ (22), రీషాన్‌ తాజుద్దీన్‌ షేక్‌ (22), హుజైర్‌ ఫర్హాన్‌ బేగ్‌ (22), మాజిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌ (22), కేఏ నదీం అహ్మద్‌ (22) జబీవుల్లా (32), ఎన్‌.నదీమ్‌ ఫాజిల్‌ (27) అనే వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. 
 
రీషాన్‌ తాజుద్దీన్‌ షేక్‌, మాజిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌, కేఏ నదీం అహ్మద్‌ అనే వారు మెకానికల్‌, ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేయగా మరో ఇద్దరికి సాంకేతిక విద్యానేపథ్యం ఉందని గుర్తించారు. దాన్ని ఉపయోగించుకుని రోబోట్లు, డ్రోన్‌ల సాయంతో దాడులకు ప్రణాళికలను రూపొందించారని ఎన్‌ఐఏ తన అదీనపు అభియోగపత్రంలో పేర్కొంది. భద్రా నదీ తీరంలో తాము తయారు చేసిన బాంబును పేల్చారని ఇప్పటికే ఒక అభియోగపత్రంలో ఎన్‌ఐఏ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments