Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ కేపిటల్‌లో రోబో సాయంతో భారీ పేలుళ్ళకు కుట్ర

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (14:42 IST)
దేశ ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగుళూరు మహానగరంలో ఉగ్రసంస్థ ఐసిస్‌ సహకారంతో భారీ పేలుళ్లకు పాల్పడేందుకు తీవ్రవాదులు కుట్ర పన్నారని ఎన్.ఐ.ఏ ఆరోపిస్తుంది. దేశ వ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడేందుకు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) విచ్ఛిన్నం చేసి, ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా వీరిపై చార్జిషీటును తాజాగా సమర్పించింది. 
 
ఆ కుట్ర కేసులో మహ్మద్‌ షరీఖ్‌ (25), మాజ్‌ మునీర్‌ అహ్మద్‌ (23), సయ్యద్‌ యాసిన్‌ (22), రీషాన్‌ తాజుద్దీన్‌ షేక్‌ (22), హుజైర్‌ ఫర్హాన్‌ బేగ్‌ (22), మాజిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌ (22), కేఏ నదీం అహ్మద్‌ (22) జబీవుల్లా (32), ఎన్‌.నదీమ్‌ ఫాజిల్‌ (27) అనే వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. 
 
రీషాన్‌ తాజుద్దీన్‌ షేక్‌, మాజిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌, కేఏ నదీం అహ్మద్‌ అనే వారు మెకానికల్‌, ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేయగా మరో ఇద్దరికి సాంకేతిక విద్యానేపథ్యం ఉందని గుర్తించారు. దాన్ని ఉపయోగించుకుని రోబోట్లు, డ్రోన్‌ల సాయంతో దాడులకు ప్రణాళికలను రూపొందించారని ఎన్‌ఐఏ తన అదీనపు అభియోగపత్రంలో పేర్కొంది. భద్రా నదీ తీరంలో తాము తయారు చేసిన బాంబును పేల్చారని ఇప్పటికే ఒక అభియోగపత్రంలో ఎన్‌ఐఏ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments