Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

సెల్వి
శుక్రవారం, 16 మే 2025 (20:22 IST)
తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాలో నాలుగు నెలల గర్భిణి దివ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణించిన శోకంలో భర్త ప్రతాప్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణామలై జిల్లా వనవాసిని ఆడుళ్ల విళంగాడు గ్రామాన్ని చెందిన వేలు అనే వ్యక్తి కుమార్తె దివ్య (19). ఇతనికి, వందవాసి, విలంగాడు గ్రామానికి చేరిన చెల్లప్పన్ కుమారుడు ప్రతాప్ (25) గత ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నారు. 
 
ప్రతాప్ చెన్నై ప్రైవేట్ లారీ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తూ వచ్చాడు. ఇక ప్రతాప్ భార్య దివ్య 4 నెలల గర్భవతి. అయితే గత 10 రోజుల క్రితం దివ్య తల్లి ఇంటికి వెళ్లింది. కానీ గత రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్య ఒక్కసారిగా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దివ్య కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయం తెలిసి ప్రతాప్ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. 
 
భార్య మరణించిన విషయాన్ని ప్రతాప్ జీర్ణించుకోలేకపోయాడు. భార్య మరణవార్త విని చేతిలో విషంతో బస్సెక్కిన ప్రతాప్ మార్గమధ్యంలోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో 4 నెలల గర్భిణి దివ్య తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చింది. దీని కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలియవచ్చింది. భార్య లేని శోకంలోనే భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం