Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు రోజుల శిశువును తొక్కి చంపిన కనికరం లేని ఖాకీలు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (11:37 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నాలుగు రోజుల శిశువును పాషాణ హృదయులైన కొందరు పోలీసులు కాళ్ళతో తొక్కి చంపేశారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ విచారణకు ఆదేశించారు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలోని కోసాగోండోడిఘి గ్రామంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, డియోరి పోలీస్ స్టేషన్ పరిధిలో భూషన్ పాండే వృద్ధుడిపై ఒక కేసుకు సంబంధించిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకను పసిగట్టిన ఆ వృద్ధుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడ నుంచి పారిపోయారు. ఇంట్లోకి వెళ్ళి చూసిన పోలీసులకు చిన్న శిశువు మాత్రమే కనిపించింది. ఆ బిడ్డ నిద్రపోతుండటంతో కుటుంబ సభ్యులు ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. 
 
ఇంటితో పాటు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు గాలించిన పోలీసులకు వారు ఎక్కడా కనిపించకపోవడంతో వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా నాలుగున్నర నెలల శిశువు మరణించివుండంతో వారు బోరున విలపించసాగారు. నిద్రిస్తున్న చిన్నారిని పోలీసులు కాళ్ళతో తొక్కి చంపారని శిశువు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వచ్చిన కథనాలపై జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ స్పందించారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments