Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి 500 మందికి మించరాదు... నిశ్చితార్థం 100 మంది అతిథులకే పరిమితం

సాధారణంగా పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. భారీ సంఖ్యలో అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగే వేడుక. అలా జరిగే పెళ్లి గురించి ప్రతి ఒక్కరూ ఓ యేడాది చెప్పకోవాలి. కానీ, ఇకపై అటువంటి హంగామా చేసే

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (15:13 IST)
సాధారణంగా పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. భారీ సంఖ్యలో అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగే వేడుక. అలా జరిగే పెళ్లి గురించి ప్రతి ఒక్కరూ ఓ యేడాది చెప్పకోవాలి. కానీ, ఇకపై అటువంటి హంగామా చేసే అవకాశం లేకుండా చేయాలని జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లకు అతిథులను ఆహ్వానించడంపై పరిమితి విధించింది. అమ్మాయి పెళ్లిచేసేవారు గరిష్టంగా 500 మందిని, అబ్బాయి పెళ్లి చేసేవారు 400 మందినే ఆహ్వానించాలని షరతు విధించింది. 
 
ఇక నిశ్చితార్థం వంటి చిన్నపాటి శుభకార్యాలను 100 మంది అతిథుల సమక్షంలో మాత్రమే జరుపుకోవాలని సూచించింది. అంతేకాదండోయ్... లౌడ్‌స్పీకర్లు ఉపయోగించడంపై, బాణసంచా కాల్చడంపై, ఆహ్వాన పత్రికతో స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ వంటివి అందించడంపై నిషేధం విధించింది. రాష్ట్రంలోని వనరులు భారీ పెళ్లిళ్ల పేరిట దుర్వినియోగం కాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments