Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్రాస్ ఘటన.. 62 అవుట్‌ గోయింగ్ కాల్స్, 42 ఇన్‌కమింగ్ కాల్స్.. మొత్తం 104సార్లు..?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (10:49 IST)
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హత్రాస్ సామూహిక అత్యాచారం కేసులో మరో కోణం బయటపడింది. ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్‌తో బాధితురాలు ఫోన్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా ఫోన్ పరిశీలించగా ఇది తేలిందని చెప్పారు.

ఏడాది నుంచి వీరిద్దరూ తరుచూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు పేర్కొన్నారు. మృతురాలు సోదరుడి పేరుతో ఉన్న సిమ్ నుంచి ఈ సంభాషణలు సాగాయని అన్నారు. దాదాపు 100కు పైగా కాల్స్ ఉన్నాయని గుర్తించారు.
 
ఇరువురి ఫోన్ నంబర్ల మధ్య 62 అవుట్‌ గోయింగ్ కాల్స్, 42 ఇన్‌కమింగ్ కాల్స్ కలిపి మొత్తం 104 సార్లు ఉన్నాయని తెలిపారు. అక్టోబరు 2019 నుంచి మార్చి 2020 మధ్య ఈ సంభాషణలు జరిగాయని అన్నారు.

చందపా ప్రాంతంలో ఉన్న సెల్ టవర్‌ నుంచి ఎక్కువ కాల్స్‌ వెళ్లినట్టుగా పేర్కొన్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సందీప్‌తో ఆమె ఫోన్ మాట్లాడినట్టు తేలడంతో సంచలనంగా మారింది.
 
అయితే దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేసును తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పోస్టుమార్టం రిపోర్టులోనూ అత్యాచారం జరగలేదని తేలిందని ఏడీజీ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయిందని పేర్కొన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments