Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ సిమ్ కార్డుల అడ్డుకట్టకు చర్యలు.. ఇకపై సిమ్ కావాలంటే ఆ పని చేయాల్సిందే...

ఠాగూర్
గురువారం, 23 మే 2024 (13:52 IST)
దేశ వ్యాప్తంగా నకిలీ సిమ్ కార్డుల బెడద పెరిగిపోయింది. నకిలీ సిమ్ కార్డులతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వీటికి అడ్డుకట్టకు కేంద్రం దృష్టిసారించింది. ఇకపై బయోమెట్రిక్ పూర్తి చేస్తే కొత్త సిమ్ విధానాన్ని అమల్లోకి తీసుకునిరానుంది. ఈ విధానం రానున్న సెప్టెంబరు 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. 
 
సైబర్ నేరాల అడ్డుకట్టకు వేసేందుకు కఠిన చర్యలు చేపట్టేందుకు, కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. మరీ ముఖ్యంగా సిమ్ కార్డుల జారీ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని భావిస్తుంది. యధేచ్చగా జారీ అవుతున్న సిమ్ కార్డులను ఉపయోగించుకుని నేరగాళ్ళు ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో టెలీకమ్యూనికేషన్ చట్టం 2023లో తీసుకొచ్చిన నిబంధనలు సెప్టెంబరు నుంచి అమల్లోకి తీసుకుని రావాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ నిర్ణయించింది. 
 
కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అడిగిన వెంటనే సిమ్ కార్డు జారీ ఉండదు. బయోమెట్రిక్ పూర్తి చేస్తేనే కొత్త సిమ్ కార్డు జారీ చేస్తారు. అలాగే, స్పెక్ట్రమ్ కేటాయింపులతో పాటు శాటిలైన కమ్యూనికేషన్‌కు సంబంధించి కూడా నిబంధనలు రానున్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించాలన్నా స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ఆర్ఆర్, సలార్ రికార్డును బ్రేక్ చేసిన Kalki 2898 AD

1000 కోట్ల మార్క్ రికార్డ్‌కు చేరువలో దీపికా పదుకునే.. కల్కితో సాధ్యమా?

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం