Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో నియంతృత్వ పాలన ఉండాలని నేతాజీ కోరుకున్నారా?

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (14:35 IST)
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీ పడాలంటే కనీసం 20 యేళ్ల పాటు నియంతృత్వ పాలన ఉండాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోరుకున్నారా? అవుననే సమాధానం చెపుతోంది ఆయన రచించిన ఓ పుస్తకం. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ముందుకు సాగాలంటే ఈ తరహా పాలన తప్పదని నేతాజీ పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పుస్తక ప్రతులు తాజాగా బయటపడటంతో ఈ విషయం వెల్లడైంది. 
 
1935లో లండన్‌లో నేతాజీ రాసిన పుస్తకం 'ఇండియన్ స్ట్రగుల్' ప్రచురితం కాగా, అందులో తన భావాలను ఆయన స్పష్టంగా తెలియజేశారు. నియంతృత్వం, కమ్యూనిజంతో కూడిన ప్రభుత్వం పాలిస్తేనే భారత్ దారిలో పడుతుందని ఆయన ఆ పుస్తకంలో రాశారు. దీన్ని ఆయన సామ్యవాదంగా అభివర్ణించారు. 
 
ఇదే యేడాది రోమ్‌కు వెళ్లిన నేతాజీ ఆనాటి ఇటలీ నియంత ముస్సోలినీని కలిసి తన పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. గత కొంతకాలంగా నేతాజీ గురించి పలు సందేహాలు వస్తుండటం, ఆయన అదృశ్యంపై నెలకొన్న సందేహాలు, ప్రభుత్వ అధీనంలోని పలు పత్రాల సమాచారం తదితర అంశాలపై నరేంద్ర మోడీ సర్కారు ప్రత్యేక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments