నేపాల్‌లో రాజకీయ సంక్షోభం : పార్లమెంట్ రద్దు

Webdunia
ఆదివారం, 23 మే 2021 (13:12 IST)
నేపాల్‌లో మరోమారు రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో పార్లమెంట్‌ను రద్దు అయింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి ప్రకటించారు. ప్రధాని కేపీ శర్మ ఓలి కానీ, ఇటు ప్రతిపక్ష కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో బిద్యాదేవి ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది నవంబరు 12, 19వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, నేపాల్ పార్లమెంటు రద్దు కావడం ఐదు నెలల్లో ఇది రెండోసారి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధ్యక్షురాలు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. 
 
ప్రధాని కేపీశర్మ ఓలి కానీ, ప్రతిపక్ష నేత షేర్ బహదూర్ దేవ్‌బా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందు రాలేదు. దీంతో గురువారం అర్థరాత్రి అత్యవసరంగా సమావేశమైన కేబినెట్ పార్లమెంటును రద్దు చేయాలని ప్రతిపాదించింది. పార్లమెంటును రద్దు చేసిన బిద్యాదేవి నవంబరు 12న తొలి దశ, 19న రెండో విడత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. 
 
కాగా, పార్లమెంటును రద్దు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఓలీ-భండారీ ద్వయం నిరంకుశ, ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని నిర్ణయించాయి. అధ్యక్షురాలి నిర్ణయం ఏకపక్షమని ఆరోపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments