Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు వైద్యుడి మృతదేహాన్ని శ్మశానంలో పడేసివెళ్లిన ఆస్పత్రి సిబ్బంది.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (13:14 IST)
చెన్నై మహానగరంలో ఓ అమానవీయ ఘటన ఒకటి జరిగింది. కరోనా వైరస్ బారినపడి చెన్నైలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన నెల్లూరుకు చెందిన ఆర్థోపెడిక్ వైద్యుడు చికిత్స ఫలించక కన్నుమూశారు. దీంతో ఆయన మృతదేహానికి ఎలాంటి అంత్యక్రియలు నిర్వహించలేదు. 
 
పైగా, నగర శివారు ప్రాంతంలో ఉన్న అంబత్తూరు శ్మశానవాటికలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అది చివరకు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి దృష్టికి చేరడంతో ఆయన ఆదేశం మేరకు రంగంలోకి దిగిన చెన్నై నగర పాలక సంస్థ పారిశుద్ధ్యం కార్మికులు మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో మరో ప్రాంతానికి తరలించారు.
 
కాగా, కరోనా వైరస్ బారినపడి చనిపోతే మృతదేహాలను కుటుంబం సభ్యులకు ఇప్పగించరాదన్న నిబంధన ఉంది. దీంతో నెల్లూరు వైద్యుడి మృతదేహాన్ని కూడా బంధువులకు ఇవ్వలేదు. అయితే, ఆస్పత్రి సిబ్బందే దాన్ని ఖననం చేయాల్సివుంది. కానీవారు అత్యం అమానవీయంగా నడుచుకున్నారు. మృతదేహాన్ని కనీసం శ్మశానవాటికలో పాతిపెట్టకుండా, ఆరుబయటే పడేసి వెళ్లిపోయారు. ఇలాంటి చర్యలపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments