Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు వైద్యుడి మృతదేహాన్ని శ్మశానంలో పడేసివెళ్లిన ఆస్పత్రి సిబ్బంది.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (13:14 IST)
చెన్నై మహానగరంలో ఓ అమానవీయ ఘటన ఒకటి జరిగింది. కరోనా వైరస్ బారినపడి చెన్నైలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన నెల్లూరుకు చెందిన ఆర్థోపెడిక్ వైద్యుడు చికిత్స ఫలించక కన్నుమూశారు. దీంతో ఆయన మృతదేహానికి ఎలాంటి అంత్యక్రియలు నిర్వహించలేదు. 
 
పైగా, నగర శివారు ప్రాంతంలో ఉన్న అంబత్తూరు శ్మశానవాటికలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అది చివరకు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి దృష్టికి చేరడంతో ఆయన ఆదేశం మేరకు రంగంలోకి దిగిన చెన్నై నగర పాలక సంస్థ పారిశుద్ధ్యం కార్మికులు మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో మరో ప్రాంతానికి తరలించారు.
 
కాగా, కరోనా వైరస్ బారినపడి చనిపోతే మృతదేహాలను కుటుంబం సభ్యులకు ఇప్పగించరాదన్న నిబంధన ఉంది. దీంతో నెల్లూరు వైద్యుడి మృతదేహాన్ని కూడా బంధువులకు ఇవ్వలేదు. అయితే, ఆస్పత్రి సిబ్బందే దాన్ని ఖననం చేయాల్సివుంది. కానీవారు అత్యం అమానవీయంగా నడుచుకున్నారు. మృతదేహాన్ని కనీసం శ్మశానవాటికలో పాతిపెట్టకుండా, ఆరుబయటే పడేసి వెళ్లిపోయారు. ఇలాంటి చర్యలపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments