Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న అత్యాచారాలకు నెహ్రూ కుటుంబమే కారణం.. మోడీ దైవాంశ సంభూతుడు: బీజేపీ ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 24 మే 2016 (19:10 IST)
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ అహుజా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోగడ.. దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, వేధింపు కేసుల్లో 50 శాతం ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయంతెల్సిందే. 
 
ఈ వ్యాఖ్యలు సద్దుమణగక ముందే... ఆయన మరోమారు నోటిదూల ప్రదర్శించారు. భారత్‌లో పెరుగుతున్న అత్యాచార ఘటనలను గాంధీ-నెహ్రూ కుటుంబానికి ఆపాదించారు. దేశంలోని అన్ని సామాజిక సమస్యలకూ నెహ్రూ కుటుంబమే కారణని ఆయన విమర్శించారు. 
 
ఆసక్తికరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దైవాంశ సంభూతిడిగా అహుజా అభివర్ణించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారాలను ఆయన త్వరలోనే రూపుమాపుతారని అన్నారు. 
 
కాగా, అహుజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ శాఖ మండిపడింది. ఆయనకు పిచ్చి పట్టిందని, వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చించాలని వ్యాఖ్యానించింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments