Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పీజీ పరీక్షలు వాయిదా - 6-8 వారాల పాటు పోస్ట్‌పోన్

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (12:38 IST)
పోస్ట్ గ్యాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష 2022 వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 12వ తేదీన నిర్వహించాల్సివుంది. కానీ, ఈ పరీక్షలను 6-8 ఎనిమిది వారాల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ఈ మేరకు పరీక్షను వాయిదా వేయాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కు సమాచారం అందించింది. ప్రస్తుతం పీజీ 2021 కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రవేశ పరీక్ష తేదీని వెల్లడించే అవకాశం ఉంది. 
 
నిజానికి నీట్ పీజీ ప్రవేశపరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు వైద్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోవిడ్ కారణంగా ఈ యేడాది చాలా మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ తమ ఇంటర్నెషిఫ్‌ను ఇంకా పూర్తి కాలేదని, అందువల్ల పరీక్షను మరో తేదీలో నిర్వహించాలని కోరింది. దీన్ని సుప్రంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments