మే 5న నీట్ యూజీ పరీక్ష - నీట్ దరఖాస్తుల గడువు పొడగింపు

ఠాగూర్
సోమవారం, 11 మార్చి 2024 (07:24 IST)
ఈ యేడాది మే 5వ తేదీన నీట్ యూజీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడగించింది. నిజానికి ఈ పరీక్షా తేదీ ఈ నెల 9వ తేదీతో ముగిసింది. ఇపుడు ఈ తేదీని ఈ నెల 16వ తేదీ వరకు పొడగించింది. ఈ నీట్ ప్రవేశ పరీక్షను రాసేందుకు భారీ ఎత్తున దరఖాస్తులు వస్తుండటంతో ఈ గడువు తేదీని పొడగించారు. జాతీయ స్థాయిలో నిర్వహించే వైద్య విద్యా కోర్సులకు నిర్వహించే ఈ నీట్ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తుల గడువు తేదీని ఈ నెల 16వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు తెలిపింది. దరఖాస్తులు భారీగా వస్తున్నందన ఈ గడువు పొడగిస్తున్నట్టు ఎన్.టి.ఏ తెలిపింది. 
 
దేశ వ్యాప్తంగా నీట్ యూజీ పరీక్షలు ఎన్.టి.ఏ ఈ యేడాది మే నెల 5వ తేదీన నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించేలా ఏర్పాట్లు చేయనుంది. నీటి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు exams.nta.ac.in అనే వెబ్‌సైట్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్.టి.ఏ సూచించింది. వాస్తవానికి ముందు షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం నీట్ యూజీ పరీక్ష దరఖాస్తు ఈ నెల 9వ తేదీతోనే ముగిసిపోయింది. అయితే, దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఈ చివరి తేదీని ఈ నెల 16వ తేదీ రాత్రి 10.50 నిమిషాల వరకు పొడగించినట్టు ఎన్.టి.ఏ. పేర్కొంది. 
 
హైకోర్టు ఆదేశాలతో టెట్, డీఎస్సీ మధ్య గడువు పెంపు.. మారిన షెడ్యూల్ 
 
హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గడువును ప్రభుత్వం పెంచింది. దీంతో ఈ  పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), డీఎస్సీ మధ్య గడువు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు టీఆర్టీ, డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. 
 
టెట్, డీఎస్సీ పరీక్షలు వెంటవెంటనే నిర్వహించడం వల్ల సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఉండడంలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. రెండు పరీక్షల మధ్య తగిన గడువు ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తాజాగా టెట్, డీఎస్సీ షెడ్యూల్ మారుస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 
 
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన తాజా షెడ్యూల్ ప్రకారం.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ప్రిన్సిపల్ పోస్టులకు ఇంగ్లీష్ ప్రావీణ్య పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. ఈ నెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి. ఈ నెల 25 నుంచి హాల్టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments