Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదర్శ దంపతులు.. రూ.కోట్ల ఆస్తిదానం.. కుమార్తెను కూడా...

డ‌బ్బే జీవితంగా, అదే ల‌క్ష్యంగా ఈ సమాజంలో ఎంతో మంది జీవిస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఆ దంపతులు ఆదర్శంగా నిలిచారు. తమ రూ.100 కోట్ల ఆస్తిని ఈ దంపతులు దానం చేశారు.

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (06:11 IST)
డ‌బ్బే జీవితంగా, అదే ల‌క్ష్యంగా ఈ సమాజంలో ఎంతో మంది జీవిస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఆ దంపతులు ఆదర్శంగా నిలిచారు. తమ రూ.100 కోట్ల ఆస్తిని ఈ దంపతులు దానం చేశారు. అంతేకాదు, అంత‌కుమించిన త్యాగం కూడా చేశారు. త‌మ మూడేళ్ల పాప‌కు కూడా వారు దూరంగా ఉండనున్నారు. దీనికంతటికీ కారణం... వారు సన్యాసి జీవితం తీసుకోవాలని నిర్ణయించుకోవడమ. ఈ కఠిన నిర్ణయం ప్రతిఒక్కరినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీమచ్‌గకు చెందిన సుమిత్, అనామిక అనే ఈ దంప‌తులు సూరత్‌లో ఈ నెల 23న జైన్ స‌న్యాసులుగా మార‌నున్నారు. ఇప్ప‌టికే త‌మ కుమార్తెను బంధువుల‌కు ద‌త్త‌త ఇచ్చారు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన ఆస్తిని, అల్లారు ముద్దుగా పెంచుకుంటోన్న కూతురిని వ‌దిలేసి వెళ్ల‌వ‌ద్ద‌ని వారి బంధువులు ఒత్తిడి తెచ్చిన‌ప్ప‌టికీ ఈ దంప‌తులు విన‌లేదు. భవ‌బంధాల‌ను తెంచుకుని ఆధ్యాత్మిక జీవిత‌మే లక్ష్యంగా వారు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ దంపతులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాన్ని మీరూ చూడండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments