'ఇండియా' పేరు మార్చేస్తున్నారు ... పాఠ్యపుస్తకాల్లో ఇకపై 'భారత్'

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (09:41 IST)
ఇండియా పేరు క్రమంగా మారిపోతుంది. ఇండియా స్థానంలో భారత్ అని చేర్చుతున్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో కూడా ఇండియా స్థానంలో భారత్ అనే పేరును ఉపయోగించారు. ఇపుడు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్.సి.ఆర్.టి) ముద్రించే పుస్తకాల్లో కూడా ఇండియా పేరును భారత్‌గా ముద్రిస్తున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్టీ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ కూడా సిఫార్సు చేసింది. దీంతో ఎన్టీఆర్టీ ముద్రించే అన్ని తరగతలు పాఠ్యపుస్తకాల్లో ఇండియా పేరు స్థానంలో ఇకపై భారత్ అని ముద్రించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే, ప్రాచీన చరిత్రను 'క్లాసిక్ హిస్టరీ' పేరుతో విద్యార్థులకు బోధించాలని సిఫార్సు చేసింది. 
 
'భారత్ పేరు.. పురాతనమైంది. ఏడువేల సంవత్సరాల క్రితం విష్ణుపురాణం లాంటి ప్రాచీన గ్రంథాల్లో 'భారత్' ప్రస్తావన ఉంది' అని ఆ కమిటీ ఛైర్మన్ ఇసాక్ వెల్లడించారు. అయితే ఈ సిఫార్సులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ ఛైర్మన్ దినేశ్ ప్రసాద్ సకలాని తెలిపారు. ఇటీవల జీ20 సమావేశాల సందర్భంగా ఆహ్వానపత్రాల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' బదులు 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ నామఫలకంలోనూ ఇండియా స్థానంలో భారత్ అని ఉంది.
 
మరోవైపు, పాఠ్యపుస్తకాల్లో హిందూ విజయాలకు ప్రముఖ స్థానం ఇవ్వాలని తమ కమిటీ పేర్కొందని ఇసాక్ తెలిపారు. 'పాఠ్యపుస్తకాల్లో ఎక్కువగా మన వైఫల్యాలనే ప్రస్తావించారు. మొగలులు, సుల్తానులపై మన విజయాలను పొందుపరచలేదు. చరిత్రను ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించి భారత్ చీకట్లో ఉన్నట్లు బ్రిటిషర్లు చూపించారు. దేశ శాస్త్ర విజ్ఞానాన్ని, ప్రగతిని విస్మరించారు. అందుకే మధ్య, ఆధునిక యుగాలతో పాటు.. భారత్ చరిత్రలో సంప్రదాయ యుగాన్ని కూడా విద్యార్థులకు నేర్పాలని సూచించాం' అని ఇసాక్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments