Webdunia - Bharat's app for daily news and videos

Install App

23న దేశవ్యాప్త సమ్మె

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (07:14 IST)
కార్మిక విధ్వంసక విధానాలు, వేతనాల కోతలు, ఉద్యోగ భద్రత కోసం ఈనెల 23వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికవర్గం  సమ్మె చేపట్టాలని నిర్ణయించింది.

దీని గురించి ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని  పిలుపునిచ్చారు. సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని కేంద్రానికి తమ నిరసన తెలపాలని రవీంద్రనాథ్‌ కోరారు.

కేంద్ర ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వులు, ఆర్డినెన్స్‌ల ద్వారా కార్మిక హక్కులను అణచి వేయడానికి, కార్మిక చట్టాల సవరణల పేరుతో మార్చడానికి పూనుకుంటున్నదని విమర్శించారు.

కీలకమైన ఆర్థిక రంగాలు రైల్వే, రక్షణ, ఉక్కు,పెట్రోలియం, విద్యుత్‌, బీమా లాంటి ప్రభుత్వ రంగ సంస్థ లలో పెట్టుబడుల ఉపసంహరణ చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు, కార్పోరేట్‌ వర్గాలకు కట్టబెట్టేందుకు సకల విధాలా ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో బేవరీ జస్‌ హమాలీ కార్మికులు, సివిల్‌ సప్లయిస్‌ హమాలీ కార్మికుల వేతన ఒప్పంద అగ్రిమెంట్‌ పూర్తయి 6 మాసాలు గడిచినా ప్రభుత్వం తిరిగి వేతన ఒప్పందం చేసుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు.

దానికి నిరసనగా రాష్ట్రంలో నెలరోజులుగా బేవరీ జస్‌ హమాలీలు శాంతియుత నిరసన తెలియజేస్తున్న ప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తక్షణమే నూతన వేతన ఒప్పందం చేసి బేవరీజస్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రవీంద్రనాధ్‌ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments