ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ నోరు పారేసుకున్నారు. మోడీ ఓ స్టుపిడ్ ప్రధాని అంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఈ యేడాది 26వ తేదీకి రెండేళ్లకాలం పూర్తి చేసుకోనున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... నరేంద్ర మోడీ సర్కారు ఈ రెండేళ్ళ కాలంలో సాధించింది ఏమైనా ఉందని శోధిస్తే పెద్ద గుడ్డు మాత్రమే లభ్యమవుతుందన్నారు. పైగా, ఆయన ఓ స్టుపిడ్ ప్రధాని అని మండిపడ్డారు.
దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రషీద్ అల్వీ తక్షణం బేషరతు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ... నరేంద్ర మోడీ ప్రజా ప్రధానమంత్రి అనే విషయాన్ని కూడా రషీద్ అల్వీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.