Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవేశంలో నిర్ణయం తీసుకోలేదు.. అమిత్ షా గారూ... త్వరలో లేఖ రాస్తాం: నారా లోకేష్

ఎన్డీయే నుంచి వైదొలగడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని తప్పుబట్టిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. రాజకీయ కారణాల నేపథ్యంలోనే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయిందంటూ

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (15:21 IST)
ఎన్డీయే నుంచి వైదొలగడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని తప్పుబట్టిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. రాజకీయ కారణాల నేపథ్యంలోనే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయిందంటూ లేఖలో చెప్పిన అమిత్ షా వ్యాఖ్యలను నారా లోకేష్ ఖండించారు. రాజకీయ లబ్ధితో ముందుకు వెళ్తున్నది టీడీపీ కాదని, బీజేపీనేనని చెప్పారు. 
 
రాజకీయ కారణాలతోనే ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు అందించట్లేదని ఫైర్ అయ్యారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లకు ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటని... యుటిలైజేషన్ సర్టిఫికెట్లకు 19 హామీలను నెరవేర్చకపోవడానికి సంబంధం ఏమిటని నారా లోకేష్ అడిగారు. ఏపీ సమస్యలపై అమిత్ షాకు అవగాహన కూడా లేదనే విషయం ఆయన రాసిన లేఖను బట్టే అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. 
 
అన్ని వివరాలను పొందుపరుస్తూ.. త్వరలోనే కేంద్రానికి ఏపీ సర్కారు లేఖ రాస్తుందని నారా లోకేష్ చెప్పారు. ప్రభుత్వం సమర్పించిన యూసీ వివరాలన్నింటినీ లేఖలో పొందుపరుస్తామని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. 
 
యూసీలు సమర్పించడంలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో వుందన్న విషయాన్ని నారా లోకేష్ గుర్తు చేశారు. అలాంటప్పుడు యూసీలను ఏపీ ఇవ్వలేదని ఆరోపణలు చేయడం ఏమిటన్నారు. ఎన్డీయే నుంచి బయటకు రావాలనే నిర్ణయాన్ని ఆవేశంలో తీసుకోలేదని.. కేంద్ర సర్కారు వైఖరి వల్లే తీసుకున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments