Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్‌ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్న నటి నగ్మా... రజినీ అలా అన్నారట...

జయలలిత మరణం తరువాత తమిళనాడు రాజకీయాలు రోజుకో విధంగా మారుతూనే ఉన్నాయి. అన్నాడిఎంకేలో రెండు వర్గాలుండగా, డిఎంకే పార్టీ నేతలు అన్నాడిఎంకే నేతల్ని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే ప్రముఖ నటుడు రజనీకాంత్ ను రాజక

Webdunia
సోమవారం, 8 మే 2017 (19:58 IST)
జయలలిత మరణం తరువాత తమిళనాడు రాజకీయాలు రోజుకో విధంగా మారుతూనే ఉన్నాయి. అన్నాడిఎంకేలో రెండు వర్గాలుండగా, డిఎంకే పార్టీ నేతలు అన్నాడిఎంకే నేతల్ని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే ప్రముఖ నటుడు రజనీకాంత్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని బిజెపి భావించింది. ఏకంగా అమిత్ షానే రంగంలోకి దిగి రజనీతో సంప్రదింపులు జరిపారు.
 
చివరి వరకు రజినీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అందరూ భావించారు. అయితే అదంతా రివర్సయ్యింది. తాను ప్రస్తుతం బిజెపిలోకి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పారు రజనీ. తాత్కాలికంగా రజనీ రాజకీయాల్లోకి వెళ్ళడం తెరపడిందని అందరూ భావించారు. కానీ నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత నగ్మా రజినీని కలవడం మరోసారి ఆయన్ను రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
 
నగ్మా.. రజనీకాంత్‌తో కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరి కలయిక అప్పట్లో ప్రేక్షకులకు పండుగే. వీరు కలిసి నటించిన సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూసేవారు. అయితే ఆ తరువాత నగ్మా రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం. సినీరంగాన్ని వదలేయడం జరిగిపోయాయి. కానీ వీరి మధ్య స్నేహం మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. నిన్న ఉన్నట్లుండి నగ్మా రజినీని చెన్నైలోని తన నివాసంలో కలిశారు. దీంతో ఒక్కసారిగా ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
కాంగ్రెస్ పార్టీలోకి రజినీని ఆహ్వానించినట్లు కూడా తెలుస్తోంది. తమిళనాడులో తిరుగులేని హీరో రజినీ..లక్షలమంది అభిమానులు ఆయనకు ఉన్నారు. ఆయన్ను కాంగ్రెస్ లోకి తీసుకుంటే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదనేది సోనియాగాంధీ భావన. అందుకే ఏకంగా నగ్మాను రంగంలోకి దిగి రజినీతో సంప్రదింపులు జరపమని పంపించినట్లు తెలుస్తోంది. అయితే రజినీ మాత్రం ఈ విషయంపై తరువాత మాట్లాడతానని చెప్పారట. అయితే ఇప్పుడు రజినీకాంత్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments