Webdunia - Bharat's app for daily news and videos

Install App

400 ఏళ్ల తర్వాత శాప విముక్తి.. మైసూర్ రాజకుటుంబానికి వారసుడొచ్చాడు..

నాలుగు వందల సంవత్సరాల నిరీక్షణ అనంతరం మైసూరు మహారాజ వంశానికి శాప విముక్తి కలిగింది. మైసూరు యువరాజు యదువీర తండ్రి అయ్యారు. 400 ఏళ్ల క్రితం శ్రీరంగపట్నం మహారాజు శ్రీరంగాయన(తిరుమలరాజ) భార్య అలివేలమ్మ శాప

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (10:54 IST)
నాలుగు వందల సంవత్సరాల నిరీక్షణ అనంతరం మైసూరు మహారాజ వంశానికి శాప విముక్తి కలిగింది. మైసూరు యువరాజు యదువీర తండ్రి అయ్యారు. 400 ఏళ్ల క్రితం శ్రీరంగపట్నం మహారాజు శ్రీరంగాయన(తిరుమలరాజ) భార్య అలివేలమ్మ శాపం రాజవంశానికి తగిలిందని అంటారు. ఆ శాప విముక్తి అయ్యింది.. ఇందులో భాగంగా మైసూరు రాజకుటుంబంలో కొత్త వారసుడు కూడా ఉదయించాడు. 
 
శ్రీ యదువీర కృష్ణదత్త చామరాజ వడయార్, త్రిషికా దేవి దంపతులకు పండంటి బాబు జన్మించాడు. రాజస్థాన్‌లోని దుంగాపూర్ రాజకుటుంబానికి చెందిన హర్షవర్థన్ సింగ్ కుమార్తె త్రిషికను యదువీర్ గత ఏడాది జూన్ 27న వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో త్రిషికా జన్మనిచ్చిన బాబు వడయార్ వంశంలో 28వ తరానికి చెందినవాడు. 
 
బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో త్రిషికా దేవి పండంటి బాబుకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా, దివంగత మైసూరు రాజు శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్, ప్రమోదా దేవి దంపతులకు సంతానం కలుగకుంటే, యదువీర్ గోపాల్ రాజును 2015 ఫిబ్రవరిలో దత్తత తీసుకుని, ఆయనకు సంప్రదాయ కిరీటాన్ని అప్పగించిన సంగతి విదితమే. దీంతో 600 సంవత్సరాల వడయార్ చరిత్రలో యదువీర్ 27వ తరం రాజుగా నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments