Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో కరోనా కలకలం : మైసూర్ ప్యాలెస్ మూసివేత

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (07:10 IST)
కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో ఇపుడు కర్నాటక రాష్ట్రం కూడా చేరిపోయింది. దీంతో ప్రఖ్యాత మైసూర్ ప్యాలెస్‌ను మూసివేశారు. ఈ ప్యాలెస్‌లో పని చేసే ఉద్యోగి బంధువులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఈ ప్యాలెస్‌ను మూసివేశారు. 
 
అయితే శానిటైజేషన్ తర్వాత మళ్లీ సోమవారం తెరిచే అవకాశమున్నట్లు సమాచారం. తొలుత కరోనా కారణంగా మార్చి 15 నుంచి 22 వరకూ వారం రోజుల పాటు ప్యాలెస్‌ను మూసివేసినట్లు ప్యాలెస్ కమిటీ తెలిపింది. 
 
ఇదిలావుంటే.. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
కొత్తగా కర్ణాటకలో 2,228 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 1,373 కేసులు బెంగళూరులోనే నమోదు కావడం గమనార్హం. మరణాల సంఖ్య కూడా కొంత ఆందోళనకరంగానే ఉంది. గత 24 గంటల్లో కర్ణాటకలో కరోనా వల్ల 17 మంది మరణించారు. దీంతో.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 486కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments