Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీని రాజకీయాల నుంచి తరిమికొడతా: మమతా బెనర్జీ భీష్మ ప్రతిజ్ఞ

మహాభారతంలో భీష్ముడు చేసిన ప్రతిజ్ఞలా పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ప్రతిజ్ఞ చేశారు. పెద్ద నోట్ల రద్దుపై మొదటి నుంచి విమర్శలు కురిపిస్తున్న మమత.. మోడీపై తీవ్ర

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (09:24 IST)
మహాభారతంలో భీష్ముడు చేసిన ప్రతిజ్ఞలా పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ప్రతిజ్ఞ చేశారు. పెద్ద నోట్ల రద్దుపై మొదటి నుంచి విమర్శలు కురిపిస్తున్న మమత.. మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను మరణించాల్సి వచ్చినా సరే, మోడీని మాత్రం దేశ రాజకీయాల నుంచి తరిమికొడతానని తీవ్రస్వరంతో ప్రతిజ్ఞ చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే, మోడీని గద్దె నుంచి దించేస్తానని హెచ్చరించారు. దానికోసం జైలుకు పోవడానికైనా, ప్రధాని ఇంటి ముందు బైఠాయించడానికైనా సిద్ధమేనని సవాల్‌ విసిరారు. 
 
దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా నడిపించడం గురించి నరేంద్ర మోడీ ఉపన్యాసాలు దంచుతున్నారని మమత మండిపడ్డారు. ఆకలితో ఉన్న జనం క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను తినాలా అని ప్రశ్నించారు. కేంద్రం విధించిన అప్రకటిత ఆర్థిక ఎమర్జెన్సీ తొలగిపోయేదాకా విశ్రమించను. తనను వ్యతిరేకించే వారి పైకి మోడీ సీబీఐ, ఈడీ, ఐటీని ఉసిగొల్చి, అణచేయాలని చూస్తున్నారు. 
 
కానీ తను ఎవ్వరూ అణచలేరని మమత బెనర్జీ తెలిపారు. మళ్లీ ఢిల్లీ వెళ్లి, నిరసన ప్రదర్శన నిర్వహిస్తానని వెల్లడించారు. కాగా, భారత బంద్‌ వల్ల సామాన్యుల కష్టాలు పెరగడం తప్ప, ప్రయోజనం శూన్యమని మమత అన్నారు.

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments