Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయి ఫోన్ మాట్లాడితే రూ.25 వేల అపరాధం ఎక్కడ?

ఆ గ్రామంలో అమ్మాయి ఫోన్ మాట్లాడితే రూ.25వేల అపరాధం విధించాలని ముస్లిం మతపెద్దల పంచాయితీ తీర్మానించింది. అలాగే, గోవధకు పాల్పడితే రూ.2.50 లక్షల అపరాధం విధించేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ముస్లిం మత

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (16:23 IST)
ఆ గ్రామంలో అమ్మాయి ఫోన్ మాట్లాడితే రూ.25వేల అపరాధం విధించాలని ముస్లిం మతపెద్దల పంచాయితీ తీర్మానించింది. అలాగే, గోవధకు పాల్పడితే రూ.2.50 లక్షల అపరాధం విధించేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ముస్లిం మతపెద్దల పంచాయతీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథుర జిల్లా మడోరా గ్రామంలో సుమారు మూడు వేల మంది ముస్లింలు నివశిస్తున్నారు. అంటే.. ఈ గ్రామంలో ముస్లింలదే ఆధిపత్యం. ఈ నేపథ్యంలో గో సంరక్షణ కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాటుపడుతున్నారు. ఈయనకు అండగా నిలబడేందుకు వీలుగా ఈ ముస్లిం గ్రామ పెద్దలు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. 
 
గోవధకు పాల్పడిన వారికి రూ.2.5లక్షల జరిమానా విధించాలని... అందులో రూ.51 వేలను సమాచారం అందించిన వారికి ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, రోడ్లపై ఆడపిల్లలు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళితే రూ.21 వేలు జరిమానా విధించాలని పంచాయతీ సభ్యులు నిర్ణయించారు. బాలికలపై జరుతున్న నేరాలను అరికట్టేందుకు, పారిపోతున్న ప్రేమ జంటలకు చెక్ పెట్టేందుకు ఈ తీర్మానం తీసుకున్నట్టు గ్రామస్తులు చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments