Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయి ఫోన్ మాట్లాడితే రూ.25 వేల అపరాధం ఎక్కడ?

ఆ గ్రామంలో అమ్మాయి ఫోన్ మాట్లాడితే రూ.25వేల అపరాధం విధించాలని ముస్లిం మతపెద్దల పంచాయితీ తీర్మానించింది. అలాగే, గోవధకు పాల్పడితే రూ.2.50 లక్షల అపరాధం విధించేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ముస్లిం మత

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (16:23 IST)
ఆ గ్రామంలో అమ్మాయి ఫోన్ మాట్లాడితే రూ.25వేల అపరాధం విధించాలని ముస్లిం మతపెద్దల పంచాయితీ తీర్మానించింది. అలాగే, గోవధకు పాల్పడితే రూ.2.50 లక్షల అపరాధం విధించేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ముస్లిం మతపెద్దల పంచాయతీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథుర జిల్లా మడోరా గ్రామంలో సుమారు మూడు వేల మంది ముస్లింలు నివశిస్తున్నారు. అంటే.. ఈ గ్రామంలో ముస్లింలదే ఆధిపత్యం. ఈ నేపథ్యంలో గో సంరక్షణ కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాటుపడుతున్నారు. ఈయనకు అండగా నిలబడేందుకు వీలుగా ఈ ముస్లిం గ్రామ పెద్దలు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. 
 
గోవధకు పాల్పడిన వారికి రూ.2.5లక్షల జరిమానా విధించాలని... అందులో రూ.51 వేలను సమాచారం అందించిన వారికి ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, రోడ్లపై ఆడపిల్లలు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళితే రూ.21 వేలు జరిమానా విధించాలని పంచాయతీ సభ్యులు నిర్ణయించారు. బాలికలపై జరుతున్న నేరాలను అరికట్టేందుకు, పారిపోతున్న ప్రేమ జంటలకు చెక్ పెట్టేందుకు ఈ తీర్మానం తీసుకున్నట్టు గ్రామస్తులు చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments