''జై శ్రీరామ్'' చెప్పమన్నారు.. స్తంభానికి కట్టేసి చితకబాది.. చంపేశారు? (video)

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (14:00 IST)
దొంగలించేందుకు వచ్చాడని ఆరోపిస్తూ ఓ యువకుడిపై దారుణంగా దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్, హర్ష్వాన్ జిల్లాకు చెందిన ప్రజలు అన్సారీ అనే 24ఏళ్ల యువకుడిని స్తంభానికి కట్టివేసి దారుణంగా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు ప్రజల నుంచి ఆ యువకుడిని కాపాడారు. 
 
ఆపై ఆస్పత్రికి తరలించారు. ఇంకా అతనిపై ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 22వ తేదీ ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం అన్సారీపై దాడి చేసేటప్పుడు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో అన్సారీని జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ చెప్పాల్సిందిగా బలవంతం చేసినట్లుంది. ఈ వీడియో ఆధారంగా అన్సారీపై దాడికి పాల్పడిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఈ ఘటనపై పోలీసులు అందించిన వివరాల మేరకు.. అన్సారీ పూణేలో పనిచేస్తుండేవాడని.. రంజాన్ కోసం స్వగ్రామానికి వచ్చాడని.. అంతేగాకుండా స్నేహితులతో కలిసి దొంగతనం చేయడం కూడా అతని అలవాటని చెప్పారు. ఇలా జార్ఖండ్‌లోకి దొంగతనం కోసం వచ్చిన అన్సారీ.. స్థానికులకు చిక్కుకున్నాడు. అలా దొరికిపోయిన యువకుడిని స్థానికులు తీవ్రంగా గాయపడేలా దాడి చేశారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments