Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజే సౌండ్‌‍కు కోళ్ళకు గుండెపోటు.. 66 కోళ్లు మృతి

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (19:12 IST)
సాధారణంగా గుండెపోటు కేవలం మనుషులకు మాత్రమే వస్తుందని అనుకుంటాం. కానీ, కోళ్ళకు కూడా వస్తుందని తాజాగా వెల్లడైంది. అదీ కూడా డీజే సౌండ్‌ను తట్టుకోలేక ఏకంగా 63 కోళ్లు మృతి చెందాయి. ఈ కోళ్లన్నీ ఆ శబ్దాన్ని తట్టుకోలేక గుండెపోటు వచ్చి చనిపోయాయి. దీంతో పౌల్ట్రీఫాం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత కేసు ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌‍లో సంభవించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, బాలాసోర్‌కు చెందిన రంజిత్ అనే యువకుడికి పౌల్ట్రీఫాం వుంది. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ఈ యువకుడు ప్రభుత్వం ఉద్యోగం రాకపోవడంతో సొంతంగా ఈ పౌల్ట్రీని పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నాడు. 
 
ఈ క్రమంలో గత ఆదివారం ఆ ఫామ్ పక్కనే ఉన్న ఇంట్లో ఓ వివాహం జరిగింది. రాత్రి 11.30 గంటల సమయంలో చెవులకు చిల్లులు పడేలా డీజే సౌండ్ పెట్టి డ్యాన్సులు చేశారనీ, ఈ కారణంగా కోళ్లు తట్టుకోలేక అల్లాడిపోతూ అటూఇటూ కొట్టుకుంటూ పడిపోయి ప్రాణాలు విడిచాయని పేర్కొన్నాడు. 
 
కోళ్ళ పరిస్థితిని చూసి సౌండ్ తగ్గించాలని ఎంతో ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదని వాపోయాడు. మరుసటి రోజున వెటర్నరీ వైద్యుడుకు చూపించగా, అవి గుండెపోటుతో చనిపోయినట్టు నిర్దారించారని తెలిపారు. దీనికి డీజే శబ్దాలే కారణమని స్పష్టం చేసినట్టు తెలిపారు. ఈ అంశంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments