Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనువుగా మాట్లాడుతోందనీ చెంప ఛెళ్లుమనిపించిన ప్రియుడు... ప్రాణాలు విడిచిన మహిళ

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (12:40 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. తన ప్రియురాలు మరో వ్యక్తితో చనువుగా మాట్లాడటాన్ని ఓ ప్రియుడు జీర్ణించుకోలేక పోయాడు. ఈ విషయాన్ని ఆమెకు పలుమార్లు చెప్పాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో మరో వ్యక్తితో మాట్లాడుతున్న ప్రియురాలిని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన ప్రియుడు.. ఆమె చెంప ఛెళ్ళుమనిపించాడు. అంతే... ఆమె అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని మాన్ ఖుర్ద్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ప్రాంతానికి చెందిన సీతా ప్రధాన్ (35) అనే మహిళకు బాయ్‌ఫ్రెండ్ రాజు పూజారీ అనే వ్యక్తివున్నాడు. అయితే, ఈమె మరో వ్యక్తితో చనువుగా ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఆ వ్యక్తితో చనువుగా మాట్లాడుతుండటాన్ని బాయ్‌ఫ్రెండ్ చూశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే సీతా ప్రధాన్ చెంపఛెళ్లుమనింపించాడు. 
 
అంతే, ఆ మహిళ అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఘట్కోపర్‌లోని రాజావాది ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. దీనిపై ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా మాన్ ఖుర్ద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె శవపరీక్ష నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనలో రాజుని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments