Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరినో ఉద్దేశించి అలా ట్వీట్ చేయలేదు.. ఆవేదనతోనే..?: నేహా ధూపియా

Webdunia
సోమవారం, 27 జులై 2015 (18:14 IST)
ప్రధాని నరంద్ర మోడీపై పరోక్షంగా ట్వీట్ చేసిన సినీ నటి నేహా ధూపియా.. ఆమెపై నిరసనలు వెల్లువెత్తడంతో మెల్లగా వాయిస్ తగ్గించేసింది. 'పాలన అంటే సెల్ఫీ విత్ డాటర్, యోగా డేలు నిర్వహించడం కాదని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడడం' అంటూ నేహా ధూపియా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. 
 
ఈ వ్యాఖ్యలపై ఒకవైపు నిరసనలు వెల్లువెత్తాయి. ఓ వర్గం ప్రజలు ఆమె నటన, చేసిన పాత్రలు, ప్రస్తుత అవకాశాలు, వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తించారు. కొంతమంది ఆమె ఇంటి వద్ద ఆందోళన కూడా నిర్వహించారు. దీంతో, ఆమె తన ట్విట్టర్ వ్యాఖ్యలపై స్పందించింది. 
 
దేశ వాణిజ్య నగరమైన ముంబైలో వర్షాలు కురిసి జనజీవనం స్తంభించిపోతోందని, అలాంటప్పుడు ఏమీ చేయలేకపోతున్నామన్న ఆవేదనతోనే అలా ట్వీట్ చేశానని, ఎవరినో ఉద్దేశించి అలా ట్వీట్ చేయలేదని నేహా ధూపియా స్పష్టం చేసింది. నిరసనకారులు తన ఇంటి వద్ద ఆందోళన చేసినప్పుడు రక్షణ కల్పించిన పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలియజేసింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments