Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరునెలల పాపతో పాటు 17 మంది మృతి!

Webdunia
ఆదివారం, 5 జూన్ 2016 (14:54 IST)
ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆదివారం ఉదయం చోటుచేసుకున్న భారీ రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వేగంగా దూసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి రెండు కార్లను ఢీకొని 20 అడుగుల లోతు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
 
ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ హైవేలో నిలుచుని పంక్చర్ అయిన ఇనోవా కారుకు డ్రైవర్ టైర్ మారుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. లగ్జరీ బస్సు సతారా నుంచి వస్తుండగా నిలుచున్న ఇనోవా కారును ఢీకొనడంతో పాటు 20 అడుగుల కిందకు పడిపోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరునెలల పాపతో పాటు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments