Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో నివసించడం సురక్షితం కాదు : మాజీ సీఎం సతీమణి ట్వీట్ (video)

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (09:13 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో జీవించడం ఏమాత్రం సురక్షితం కాదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఓ ట్వీట్ చేశారు.
 
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా, ముంబై పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై పలు ఆలోచనలకు దారితీస్తోంది. 
 
ముంబై పోలీసులు కేసుని ప‌క్క‌దోవ ప‌ట్టిస్తున్నార‌ని కొంద‌రు ఆరోపిస్తున్న నేప‌థ్య‌లో బీహార్ పోలీసులు దీనిపై లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ విచారించాల‌ని మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్ తెలిపారు. 
 
ఈ పరిస్థితుల్లో ఫడ్నవిస్ భార్య శ్రీమతి అమృత ముంబై పోలీసుల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచార‌ణ చూస్తుంటే.. ముంబైలో మాన‌వ‌త్వం చ‌చ్చిపోయిందేమో అనిపిస్తుంది. అమాయ‌కం, సెల్ఫ్‌రెస్పెక్ట్ ప్ర‌జ‌ల‌కి ఇక్క‌డ ఉండ‌డం సుర‌క్షితం కూడా కాదు అని నా భావ‌న‌ అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొంది. 
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments