Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాట్‌ఫాంపై దిగగానే మహిళ బుగ్గపై ముద్దు... ఏడాది జైలు, రూ.10వేల జరిమానా

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (17:12 IST)
మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్న తరుణంలో.. ఓ మహిళ బుగ్గపై ముద్దు పెట్టినందుకు నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ముంబై మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనపై తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. 2015, ఆగస్టు 26న బాధిత మహిళ తన స్నేహిడితో కలిసి గోవాండి నుంచి లోకల్ ట్రైన్‌లో సీఎస్‌ఎంటీ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ప్లాట్‌ఫాంపై దిగగానే కిరణ్ హోనోవర్(37) ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. బలవంతంగా తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని బాధితురాలు పేర్కొంది.
 
ఈ ఘటన అనంతరం బాధితురాలు సీఎస్‌ఎంటీ రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు నిందితుడిపై సెక్షన్ 354, 354 (ఎ) (1) కింద కేసు నమోదు చేశారు. దాదాపు ఏడేళ్లుగా ఈ కేసు కోర్టులో ఉంది. సంబంధిత సాక్షులందరినీ విచారించిన అనంతరం ఫోర్ట్ కోర్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వీఎస్పీ కేదార్ నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష పదివేల రూపాయల జరిమానా విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments